బుద్ధుని ప్రకారం ‘బ్రాహ్మణుడు’

 

 

నిర్వాణ స్థితి పొందినవాడే బ్రాహ్మణుడు

బుద్ధుదు ధమ్మపదంలో “బ్రాహ్మణుణ్ణి” ఈ క్రింది విధంగా నిర్వచించాడు:

“న చాహం బ్రామ్హణం బ్రూమి, యోనిజం, మత్తి సంభవం”

– (న చాహం బ్రాహ్మణం బ్రనీ, యోనిజం మాతృ సంభవమ్) (సంస్కృతం)

  • “కేవలం బ్రాహ్మణి ఐన తల్లి గర్భంలో జన్మించిన వానిని నేను ‘బ్రాహ్మణుడు’ అనను”

“పుట్టే నివాసం యో వేది, సగ్గాపాయఞ్చ పస్సతి

అథో జాతిక్ఖయం పత్తో, అభీఞ్ఞవోసితో ముని

సబ్బవోసితవోసానం, తమహం బ్రూమి బ్రామ్హణం”

– (పూర్వం నివాసం యో వేద, స్వర్గా పాయఞ్చ పశ్చతి

అథ జాతిక్ఖయం ప్రాప్తో, అభిజ్ఞావ్యవసితో ముని

సర్వవ్యవసితావసానం, తమహం బ్రవీమి బ్రాహ్మణమ్ (సంస్కృతం)

  • “పూర్వజన్మ జ్ఞానం కలవాడు; జ్ఞాననేత్రంతో స్వర్గాన్నీ నరకాన్నీ, చూసేవాడు; జన్మరాహిత్యం పొందినవాడు; అభిజ్ఞా (దివ్యజ్ఞాన) పరాయణుడు, ముని, కృతకృత్యుడు అయినవాడినే నేను ‘బ్రాహ్మణుడు’అని అంటాను”