భగవద్గీత 8-12

“సర్వద్వారాణి సంయమ్య మనో హృది నిరుధ్యచ |
మూర్ధ్న్యాధాయాత్మనః ప్రాణం ఆస్థితో యోగధారణాం ||”

 

పదచ్ఛేదం

సర్వద్వారాణిసంయమ్యమనఃహృదినిరుధ్యమూర్ధ్నిఆధాయఆత్మనఃప్రాణంఆస్థితఃయోగధారణాం

ప్రతిపదార్థం

సర్వద్వారాణి = సర్వేంద్రియాలను ; సంయమ్య = నిగ్రహించి ; = అలాగే ; మనః = మనస్సును ; హృది = హృదయంలో ; నిరుధ్య = స్థిరం చేసి ; ప్రాణం = ప్రాణాన్ని ; మూర్ధ్ని = సహస్రారంలో ; ఆధాయ = ఉంచి ; ఆత్మనః = ఆత్మ యొక్క ; యోగధారణాం = ధ్యానంలో ; ఆస్థితః = నిమగ్నుడై ; యః = ఎవరు

తాత్పర్యం

సర్వ ఇంద్రియ ద్వారాలనూ మూసి, మనస్సును హృదయంలో నిలిపి, ప్రాణాలను సహస్రారంలో స్థిరపరచి, ఏకాగ్రచిత్తంతో ఆత్మధ్యానం చేస్తూ ఉన్నవాడు…”

వివరణ

ఇంద్రియాలు మనస్సులో బాహ్యవిషయ లాలసత అనే విక్షేపాలను కలిగించి

మనస్సునుకూడాతమవెంటబయటకుతీసుకుపోయేసామర్థ్యంకలవి

ఆ మనస్సును ఇంద్రియ అనుభవాల నుండి మరల్చి ఆత్మవైపుకి తిప్పాలి

గది కిటికీలు తెరచి ఉంచితేదీపంఆరిపోతుంది

ఇంద్రియాలను మూయకపోతే మనస్సు స్వాధీనంలోకి రాదు

ఇంద్రియాలను మూసేస్తే వాటికి నాయకత్వం వహించే మనస్సు కూడా

మనస్సు పుట్టే హృదయంలో లయమైపోతుంది.

ప్రాణంఅంటేశ్వాస ”.

శ్వాసను తదేక దీక్షతోఏకాగ్ర చిత్తంతో గమనిస్తూ ఉంటే,

శ్వాస తనంతట తానుగా భ్రూమధ్యంలో స్థితమైపోతుంది.

ఇంద్రియాలు మనస్సులో లయమైపోయి మనస్సు అంతర్ముఖమై,

చిత్తవృత్తుల నిరోధం జరుగుతుంది.

మనస్సుమనోలయం జరిగి … ‘ మనస్సులేని స్థితికి

ఆలోచనా రహిత స్థితికి చేరుకుంటుంది.

ఈ రకమైన యోగస్థితిలో

విశ్వంలోని అనంతమైన ప్రాణశక్తివిశ్వశక్తి

సహస్రార ప్రాంతంలోని బ్రహ్మరంధ్రం గుండా శరీరంలోకి ప్రవేశిస్తుంది.

ఇలా మనస్సును అంతర్ముఖం చేసిఆత్మలో నిలిపి

ధ్యానంలో వుండడమే … “ యోగధారణఅవుతుంది.