భగవద్గీత 2-22

వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి |

తథా శరీరాణి విహాయ జీర్ణా న్యన్యాని సంయాతి నవాని దేహీ || ”

 

పదచ్ఛేదం

వాసాంసిజీర్ణానియథావిహాయనవానిగృహ్ణాతినరఃఅపరాణితథాశరీరాణివిహాయజీర్ణానిఅన్యానిసంయాతినవానిదేహీ

ప్రతిపదార్థం

యథా = విధంగా ; నరః = (ఒకానొక) మానవుడు ; జీర్ణాని = శిథిలమయిన ; వాసాంసి = వస్త్రాలను ; విహాయ = వదిలిపెట్టి; అపరాణి = వేరే ; నవాని = క్రొత్త వస్త్రాలను ; గృహ్ణాతి = గ్రహిస్తాడో ; తథా = అదే విధంగా ; దేహీ = జీవాత్మ ; జీర్ణాని = శిథిలమయిన ; శరీరాణి = శరీరాలను ; విహాయ = విడిచి ; అన్యాని = ఇంకొక ; నవాని = క్రొత్త (శరీరాన్ని) ; సంయాతి = పొందుతుంది

తాత్పర్యం

చిరిగిపోయిన బట్టలను వదిలి, మనం నూతన వస్త్రాలు ధరిస్తున్నట్టే, నిరుపయోగమైన శరీరాన్ని వదిలి, ఆత్మ క్రొత్త దేహంలోకి ప్రవేశిస్తుంది. ”

వివరణ

భౌతిక శరీరాన్ని మనం వేసుకునే దుస్తులతో పోల్చారు వేదవ్యాసులవారు.

బట్టలు పాతవై చినిగిపోతూ ఉంటే

వాటిని తీసి అవతల పారేసి

వేరేవి క్రొత్తవాటిని తొడుక్కుంటాం కదా !

శరీరానికి కూడా అలాగే వయస్సు అయిపోయి

ముసలితనం వచ్చేసిశిథిలమైపోయి

మరణం ద్వారా రాలిపోయినప్పుడు

ఆత్మ వేరొక క్రొత్త శరీరాన్ని ధరిస్తుంది.

దేహం ఒక వస్త్రంమనం దేహధారులం.

మరణంఅంటే … “ పాతబడిన భౌతిక శరీరాన్ని వదిలి పెట్టెయ్యడం ”,

క్రొత్తదయినతేజోమయమైన ఆత్మతోవిహరించడమే,

ఆపైన వేరొక అనువైన భౌతిక శరీరంతో నూతన జన్మను తీసుకోవడమే !

భౌతికమైన స్థూలశరీరం యొక్క తత్వం అందరికీ తెలుసు

కానీ సూక్ష్మశరీరం యొక్క తత్వం

ఆత్మపదార్థం యొక్క తత్వంకేవలం యోగులకే తెలుసు.

దేహంలో ఉన్నప్పుడు ఆత్మపదార్థాన్నిదేహిఅంటాం.

దేహం నుండి బయటకు వచ్చేసినవిదేహిఅంటాం.

మనస్సుతో కూడుకున్నప్పుడు

సంకల్ప వికల్పాలతో కూడుకున్నప్పుడు

నేను ”, “ నాదిఅనే తత్వాలతో కూడుకున్నప్పుడు

మంచి చెడులతో కూడుకున్నప్పుడు

ఇదే ఆత్మనుజీవాత్మఅంటాం.

జీవాత్మలో ఎప్పుడైతేమంచి, చెడుఅనే భావన నశిస్తుందో

ఎప్పుడైతేనువ్వు ”, “ నేనుఅనే భావన పోతుందో

ఎప్పుడైతే అహంకారం నశిస్తుందో

అలాంటి జీవాత్మనువిముక్తాత్మఅంటాం.

ప్రతి జీవాత్మ కూడానూ జన్మపరంపరాక్రమంలోవిముక్తాత్మకావలసిందే !

ఒకానొకవిముక్తాత్మఇక అందరినీ విముక్తస్థితికి తీసుకువెళ్ళడానికి 

కంకణం కట్టుకున్నప్పుడు విముక్తాత్మలు ఇక … “ పరమాత్మలుగా 

ఉదహరించ బడతాయి !

అర్జునుడినిజీవాత్మఅనీ,

శ్రీకృష్ణుడినీ, వేదవ్యాసులవారినీపరమాత్మలుఅనీ అంటాం.

పరమాత్మఅంటే

అత్యున్నత స్థాయికి పరిణితి చెందిన జీవాత్మఅన్నమాట.

ఒకానొక జీవాత్మ మొట్టమొదటి జన్మలలో

ఒకానొకఅమాయకపు ఆత్మగాఉంటుంది.

దుష్ట సాంగత్యాలు, దుష్ట ప్రభావాల వల్లదుష్టాత్మగామారుతుంది.

సజ్జన సాంగత్యం వల్లా,

పరోపకార పరాయణత్వం వంటి సేవాభావాల వల్లా

శుభాత్మగా మారుతుంది.

తత్త్వచింతన కలిగి, ధ్యానసాధన ద్వారా

ఆధ్యాత్మిక పురోభివృద్ధి పొందుతూ, పొందుతూ

చివరకువిముక్తాత్మగా విరాజిల్లుతుంది.

ఇక విముక్తాత్మ లోకకళ్యాణం కోసంపరమాత్మఅవుతుంది.

పరమాత్మగా కాకపోతే యొక్క జీవాత్మ పూర్ణ వికాసం చెందినట్లు కాదు.

పూర్ణ వికాసం వరకు మనం మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటాం

పునరపి జననంపునరపి మరణం ”.

విధంగాఎంతవరకు ? ” అంటే

పరమాత్మగా అయ్యేంత వరకు ”.