భగవద్గీత 4-11

యే యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహమ్ |

మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః ||

 

పదచ్ఛేదం

యేయథామాంప్రపద్యంతేతాన్తథాఏవభజామిఅహంమమవర్త్మఅనువర్తంతేమనుష్యాఃపార్థసర్వశః

ప్రతిపదార్థం

పార్థ = ఓ పార్థా ; యే = ఎవరు ; మాం = నన్ను ; యథా, ప్రపద్యంతే = ఎలా సేవిస్తారో ; అహం = నేను ; తాన్ = వారిని ; తథా, ఏవ = అదే విధంగా ; భజామి = అనుగ్రహిస్తాను ; మనుష్యాః = మనుష్యులు ; సర్వశః = అన్ని విధాలుగా ; ‘మమ ’ = ‘ నా యొక్క ’ ; వర్త్మ = మార్గాన్నే ; అనువర్తంతే = అనుసరిస్తారు.

భగవాన్ ఉవాచధ్యాన ఉవాచ :

ఎవరు ఏవిధంగానన్నుసేవిస్తే వాళ్ళని ఆవిధంగానేనేనుఅనుగ్రహిస్తున్నాను. మానవులు అందరూ ఎప్పుడూనామార్గాన్నే అనుసరిస్తున్నారు. ”

వివరణ

శ్రీకృష్ణుడుఅంటేధ్యానంఅని మనం పదే పదే గుర్తుంచుకోవాలి.

నేను = ధ్యానం

అర్జునుడు = ధ్యానం తెలియని తత్వం

శ్రీకృష్ణుడు = ధ్యానం అనే తత్వం

ఈ శ్లోకంలోనేనుఅన్నప్పుడల్లాధ్యానంఅని అర్థం చేసుకోవాలి.

ఎవరు ఏవిధంగా నన్ను (ధ్యానాన్ని) సేవించినా, వాళ్ళని నేను

(ధ్యానం) ఆ విధంగా అనుగ్రహిస్తాను. ”

కృష్ణుడిలా అంతా ధ్యానయోగ సిద్ధాంతాన్ని

ఆకళింపు చేసుకుని ఆచరిస్తే మనమూ

ధ్యానయోగులుగా ఎదుగుతాం.

అందుకనికృష్ణుడిని అంటే ధ్యానాన్ని

మనం ఏవిధంగా చూడాలన్నది మనమే

నిర్ణయించుకోవాలి.

మనం అజ్ఞానంతో ధ్యానాన్ని దూరం

చేసుకుంటాం.

మనం జ్ఞానంతో ధ్యానాన్ని దగ్గర

చేసుకుంటాం.

మనల్ని మనం రాయికీ, రప్పకూ మ్రొక్కుతూ

కోరికలు తీర్చమని దేముడిని ప్రార్థించే సామాన్య మానవుడిగా భావిస్తే

ఎదగకుండా అలాగే ఉంటాం !

అదే మనల్ని మనం సర్వశక్తి సంపన్నమైన ఆత్మగా గ్రహించి

ధ్యాన సాధన చేస్తేఆత్మ తత్త్వాన్ని తెలుసుకుని ఆత్మజ్ఞానిగా మారుతాం !

మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం

కానీ ఎవరు ఏమార్గంలో ప్రయాణించినాఎన్ని జన్మలు గడిచినాచివరికి అందరూ తన

ధ్యాన మార్గాన్నే అనుసరిస్తారు అంటున్నారు శ్రీకృష్ణపరమాత్మ.

వేరే దారి లేదు మరి !

మనిషి ఎప్పటికైనా ధ్యాన మార్గానికి రావలసిందే

ధ్యాన సాధన చెయ్యవలసిందే

తాను ఆత్మనుఅని గ్రహించవలసిందే !

లేకపోతే జనన మరణ చక్రంలో పడి తిరుగుతూనే ఉంటాడు !