భగవద్గీత 9-34

                             “ మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు | 

                               మామేవైష్యసి యుక్త్వైవమ్ ఆత్మానం మత్పరాయణః ||

 

పదచ్ఛేదం

మన్మనాఃభవమద్భక్తఃమద్యాజీమామ్నమస్కురుమామ్ఏవఏష్యసియుక్త్వాఏవమ్ఆత్మానమ్మత్పరాయణః

ప్రతిపదార్థం

మన్మనాః = నాయందు మనస్సు కలవాడవు ; భవ = కా ; మద్భక్తః = నా భక్తుడవు ; (భవ = కా) ; మద్యాజీ = నన్ను పూజించు ; మామ్ = నన్ను(నాకు) ; నమస్కురు = నమస్కరించు ; ఏవమ్ = ఈ విధంగా ; ఆత్మానమ్ = ఆత్మను ; యుక్త్వా = (నామీదే) నిలిపి ; మత్పరాయణః = నా, పరమైనవాడివైతే ; మామ్, ఏవ = నన్నే ; ఏష్యసి = పొందగలవు

అర్జునుడు = నేను శరీరం అనుకునే తత్వం

శ్రీకృష్ణుడు = నేను ఆత్మ అనే తత్వం

నేను = ఆత్మ

భగవాన్ ఉవాచఆత్మ ఉవాచ:-

నాయందు మనస్సు నిల్పి, నా భక్తుడవై, నన్నే సేవించు. నన్నే నమ్మి, నాకే నమస్కరిస్తూ, నాయందే దృష్టి నిలిపితే నన్ను పొంది తీరతావు. “

వివరణ

ఎక్కడెక్కడమాం’, ‘మయిఅని వచ్చినా కూడా

అవి కృష్ణునికి సూచికలు ఎంత మాత్రం కావు

అవి ధ్యానానికి/ఆత్మకు సూచికలు అన్నది మనం పదే పదే గుర్తుంచుకోవాలి.

ఆత్మయందే మనస్సును లగ్నం చేయాలి ;

ఆత్మయొక్క భక్తుడు అవ్వాలి ; ఆత్మనే పూజించాలి ;

ఆత్మకే నమస్కరించాలి ;

ఈ విధంగా, ఆత్మను ఆత్మలోనే నిలిపి ఆత్మపరాయణుడివైతే

ఆత్మను నువ్వు పొందగలవు”.

ఇదే సరియైన అర్థం. అయితే మామూలుభగవద్గీతపుస్తకాలలో

ఈ భగవద్గీతా రహస్యాన్ని గ్రహించని వారి పుస్తకాల్లో

అర్థం పూర్తి విరుద్ధంగా వుంటుంది.

ఎలా వుంటుందంటే … “నా యందు మనస్సు నిల్పి, నా భక్తుడవై, నన్నే సేవించు ; నన్నే పూజించు ;

నన్నే నమ్మి, నాకే నమస్కరిస్తూ, నాయందే దృష్టి నిలిపితే నన్ను పొంది తీరతావు.”