భగవద్గీత 11-8

న తు మాం శక్యసే ద్రష్టుమ్ అనేనైవ స్వచక్షుషా |

దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరమ్ ||

 

పదచ్ఛేదం

తుమాంశక్యసేద్రష్టుంఅనేనఏవస్వచక్షుషాదివ్యందదామితేచక్షుఃపశ్యమేయోగంఐశ్వరం

ప్రతిపదార్థం

తు = కాని ; మాం = నన్ను ; అనేన = ; స్వచక్షుషా = చర్మచక్షువులతో ; ద్రష్టుం = చూడడానికి ; ఏవ = నిస్సందేహంగా ; , శక్యసే = సమర్థుడవు కావు ; (అతః = ఇందువలన) ; తే = నీకు ; దివ్యం = దివ్యమైన ; చక్షుః = ద్రుష్టిని ;

దదామి = ఇస్తాను ; మే, ఐశ్వరం, యోగం = నా దివ్య యోగ శక్తిని ; పశ్య = చూడు

తాత్పర్యం

కాని, సామాన్య దృష్టితో నువ్వు నన్ను చూడలేవు కనుక, నీకు దివ్యదృష్టిని ప్రసాదిస్తున్నాను ; అపురూపమైన నా విశ్వరూపాన్ని ఆ చూపుతో చూడు. ”

వివరణ

ఆత్మ దర్శనం ” .. “ పరమాత్మ దర్శనం ” … “ బ్రహ్మాత్మ దర్శనం ” …

స్థూల దృష్టికి లభించేవి కాదు

చర్మచక్షువుల దృష్టికి గోచరమయ్యేది కాదు

సూక్ష్మాతి సూక్ష్మమైన, ఇంకా సమస్త సృష్టిలో అంతటా వ్యాపించి ఉన్న

ఆత్మ దర్శనానికిపరమాత్మ దర్శనానికిబ్రహ్మాత్మ దర్శనానికి

దివ్యచక్షువులు కావాలిజ్ఞాననేత్రాలు కావాలి

అవి ధ్యాన సాధన ద్వారా మాత్రమేయోగసాధన ద్వారా మాత్రమేతనకు

తానుగా మాత్రమే సిద్ధింప చేసుకునేవి ;

అది అలౌకిక శక్తిఅలౌకిక దృష్టి !

ఆ దివ్యదృష్టిని నేను నీకు ప్రసాదిస్తున్నానుఅన్నప్పుడు

అది ఒక అద్భుతమైన ఘడియ, ఒక అద్భుతమైన సన్నివేశం !

సర్వసాధారణంగా అది జరిగే పని కాదు.

అయినా, “ Every rule has an exception ” అన్నట్లుగా

ఆ సూత్రాన్ని ఆధారం చేసుకుని ఆ సన్నివేశాన్ని రూపకల్పన చేశారు వేదవ్యాసులవారు.