భగవద్గీత 2-20

జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా భూయః |

అజో నిత్యః శాశ్వతోయం పురాణో, హన్యతే హన్యమానే శరీరే || ”

పదచ్ఛేదం

జాయతేమ్రియతేవాకదాచిత్అయంభూత్వాభవితావాభూయఃఅజఃనిత్యఃశాశ్వతఃఅయంపురాణఃహన్యతేహన్యమానేశరీరే

ప్రతిపదార్థం

అయం = ఆత్మ ; కదాచిత్ = ఎల్లప్పుడూ ; జాయతే = పుట్టడం లేదు ; వా = మరి ; మ్రియతే = మరణించదు ; వా = మరి ; భూత్వా =జన్మించి ; భూయః = మళ్ళీ ; భవితా = ఉండేది కాదు ; అయం = ఇది ( ఆత్మ) ; అజః = జన్మలేనిది ; నిత్యః = నిత్యమైనది ; శాశ్వతః = శాశ్వతమైంది ; పురాణః = సనాతనమైంది ; శరీరే = శరీరం ; హన్యమానే = చంపబడుతున్నా కూడా ; హన్యతే = చంపబడదు.

తాత్పర్యం

ఆత్మ పుట్టేదిగాని, చనిపోయేదిగానీ కాదు; అలాగని ఒకప్పుడు వుండేదీ, మరొకప్పుడు వుండనిది కూడా కాదు ; ఆత్మ జనితమైనది కాదు. ఎప్పుడూ ఒకలాగే వుండేది; నాశనం లేనిది, సనాతనమైనది; అది చంపదు, చంపబడదు ; దేహం నశించినా ఆత్మ నశించదు. ”

వివరణ

ఆత్మఅనేది … “ దేహిఅనేది

భూతకాలంలోనూ ఉందిభవిష్యత్కాలంలోనూ ఉంటుంది.

ఇది ఎప్పుడూ పుట్టలేదుఎప్పుడూ చావదు.

ఆత్మ అన్నది నిత్యం, శాశ్వతం, సనాతనం.

సనాతనమైన, నిత్యమైన, శాశ్వతమైన ఆత్మలం మనం.

ముక్కు ’, నోరు ’, కళ్ళు ’, కాళ్ళుచేతులుకాదు మనం

శరీరం చంపబడితేఆత్మచంపబడదు.

దేహం నశిస్తేదేహినశించదు.

ఇదే మౌలికమైన జ్ఞానంఆత్మజ్ఞానం !

శ్రీకృష్ణులవారి ద్వారా ప్రసారమవుతున్న భగవద్గీతాసారం.

ఇది మనం స్వానుభవం మీద తెలుసుకుని

ఆత్మతత్త్వంలోనే ఉంటూ

మన ప్రాపంచిక వ్యవహారాలు నిర్వర్తించుకోవాలి.

సదా ఆత్మ యొక్క స్వరూపాన్ని గుర్తుంచుకోవాలి

మననం చేసుకుంటూ వుండాలి.