భగవద్గీత 2-23

నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః |

చైనం క్లేదయంత్యాపో శోషయతి మారుతః || ”

 

పదచ్ఛేదం

ఏనంఛిందంతిశస్త్రాణిఏనందహతిపావకఃఏనంక్లేదయంతిఆపఃశోషయతిమారుతః

ప్రతి పదార్థం

ఏనం = ఆత్మను ; శస్త్రాణి = శస్త్రాలు ; ఛిందంతి = ఛేదింపలేవు ; ఏనం = ఆత్మను ; పావకః = అగ్ని ; దహతి = దహింపలేదు ; ఏనం = ఆత్మను ; ఆపః = నీరు ; క్లేదయంతి = తడుపలేదు ; = మరి ; మారుతః = గాలి ; శోషయతి = ఎండింపలేదు.

తాత్పర్యం

ఆత్మను శస్త్రాలు ఛేదించలేవు ; అగ్ని దహించలేదు ; నీరు తడపలేదు ; గాలి ఆరబెట్టనూ లేదు. ”

వివరణ

పంచమహాభూతాలతో తయారైంది మన భౌతిక శరీరం

దహ్యతే ఇతి దేహః ” … దహింపబడేది కనుక

శరీరాన్నిదేహంఅన్నారు.

భౌతిక శరీరం నీటితో తడిచి, చివికి, నాని పోతుంది

గాలి భౌతిక శరీరాన్ని ఎండించ గలదు

భౌతిక శరీరం శస్త్రాలతో ఛేదింపబడుతుంది

కానీఆత్మఅనేది శస్త్రాలతో ఛేదింపబడదుఅగ్నిచేత దహింపబడదు

నీటి చేత ఏమాత్రం తడుపబడదు.

పాంచభౌతిక శరీరాన్ని నాశనం చెయ్యగలవి అన్నీ కూడానూ

ఆత్మను ఏమీ చేయలేవు !

అంటేదేహం యొక్క ధర్మం వేరు .. ఆత్మ యొక్క ధర్మం వేరు

దేహం యొక్క గుణం వేరుఆత్మ యొక్క గుణం వేరు.

భౌతిక శరీరం వేరుఆత్మపదార్థం వేరు.

దేహం వేరుదేహి వేరు!

రెండూ వేరు వేరు!

ఒకటి నశించేది

ఇంకొకటి నిత్యమైనదినశించనిది.

శరీరం పుడుతుంది, చస్తుంది.

కానీ ఆత్మపుట్టదు, చావదు.

ఆత్మఅన్నది నిత్యమైనది

మార్పులు చెందనిది

సర్వవ్యాప్తమైనదిసత్యమైనది.

ఇదంతా తెలుసుకోవాలంటే 

ధ్యానం చెయ్యాలి

అనుదిన ధ్యానాభ్యాసం చేయాలి.

ప్రతి రోజూఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం, రాత్రిఎప్పుడైనా సరే! కళ్ళు రెండూ మూసుకోవాలి !

శ్వాస మీద ధ్యాస ఉంచుకోవాలిచిత్తవృత్తులను నిరోధించుకోవాలి !

అప్పుడే మనకు తెలుస్తుంది…  

మనం శరీరాలం కాదు, ఆత్మపదార్థం అని !