భగవద్గీత 2-45

త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున  |

   నిర్ద్వంద్వో నిత్యసత్త్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ || ”

 

పదచ్ఛేదం

త్రైగుణ్యవిషయాఃవేదాఃనిస్త్రైగుణ్యఃభవఅర్జుననిర్ద్వంద్వఃనిత్యసత్త్వస్థఃనిర్యోగక్షేమఃఆత్మవాన్

ప్రతిపదార్థం

అర్జున = అర్జునా ; వేదాః = వేదాలు ; త్రైగుణ్యవిషయాః = త్రిగుణాత్మకమైన విషయాలు కలవి ; నిస్త్రైగుణ్యః = త్రిగుణాలలో ఆసక్తిలేకుండా ; నిర్ద్వంద్వః = హర్షశోకాది ద్వంద్వాలు లేకుండా ; నిత్యసత్త్వస్థః = నిరంతరం శుద్ధసత్వ గుణంలో ఉంటూ ; నిర్యోగక్షేమః = యోగక్షేమాలే లేనటువంటి ; ఆత్మవాన్ = ఆత్మజ్ఞానివిగా ; భవ = ఉండు

తాత్పర్యం

అర్జునా ! వేదాలు త్రైగుణ్యవిషయాలను గురించే చెపుతున్నాయి ; నువ్వు త్రిగుణాతీతుడవుకా ! ద్వంద్వాలనూ, యోగక్షేమాలనూ విడిచి సదా శుద్ధసత్వాన్ని అవలంబించి, ఆత్మజ్ఞానివి కావాలి; ఆత్మతత్త్వంలోనే స్థిరపడు. ”

వివరణ

తమో, రజో, సత్త్వగుణాలే త్రిగుణాలు.

త్రిగుణాల గురించే ప్రస్తావిస్తున్నాయి వేదాలు.

తమోగుణం ” … అంటే తనువుకు సంబంధించిన విషయాలు.

రజోగుణం ” … అంటే మనస్సుకు సంబంధించిన విశేషాలు.

సత్త్వగుణం ” … అంటే శ్రేయస్సుకు సంబంధించిన సూత్రాలు.

త్రిగుణాల వల్ల ఏర్పడేవి కోరికలు. కోరికలను తీర్చుకునేందుకు కావలసిన

వస్తువుల కోసం చేసే కర్మకాండ అంతాత్రైగుణ్యవిషయాలు ”.

త్రిగుణాలను అధిగమించడం అంటేశరీర మనోబుద్ధులను అధిగమించడమే.

మనో బుద్ధులను అధిగమించినిరంతరం నిత్యసత్త్వస్వరూపమైన ఆత్మలో

స్థితమవడమేనిత్యసత్త్వస్థుడు ”, “ ఆత్మవంతుడుకావడం అంటే !

సుఖదుఃఖాలు, శీతోష్ణాలు, మానావమానాలుఇవన్నీ ద్వంద్వాలు.

మనిషి జీవితంలో తటస్థపడే సమస్త అనుభవాలూ ద్వంద్వాలే.

వీటినుండి బయటపడటమేద్వంద్వాతీతుడు కావడంఅంటే.

భౌతిక పరిభాషలో మన దగ్గర లేని వాటిని పొందడాన్నియోగంఅనీ,

పొందినదాన్ని రక్షించుకోవడాన్నిక్షేమంఅనీ అంటాం.

మనం సాధారణంగా చేసే ప్రతి కర్మ కూడా యోగక్షేమాలకు సంబంధించినదై

ఉంటుంది. యోగక్షేమాలనుండి బయటపడితే కర్మల నుండి బయటకి వచ్చేస్తాం

ఆత్మకుయోగం ” … అంటేఅభివృద్ధిఎక్కడ? !

ఆత్మకుక్షేమం ” …  అంటేశ్రేయస్సుఅన్నది ఎక్కడ? !

శాస్త్రీయమైన వాక్కు, శాస్త్రీయమైన ఆలోచన, శాస్త్రీయమైన కర్మ వుండాలి.

వివేకంతో ఆలోచించాలిమాట్లాడాలిజీవించాలి.

ఆత్మతత్త్వంలో స్థిరపడిఆత్మవంతుడిగా జీవించిఆత్మజ్ఞానులం కావాలి!