భగవద్గీత 2-27

జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య |

తస్మాదపరిహార్యే ర్థేన త్వం శోచితుమర్హసి || ”

 

పదచ్ఛేదం

జాతస్యహిధ్రువఃమృత్యుఃధ్రువంజన్మమృతస్యతస్మాత్అపరిహార్యేఅర్థేత్వంశోచితుంఅర్హసి

ప్రతిపదార్థం

హి = ఎందుకంటే ; జాతస్య = పుట్టినవాడికి ; మృత్యుః = మరణం ; ధ్రువః = నిశ్చయం ; = అంతేకాక ; మృతస్య = మరణించినవానికి ; జన్మ = పుట్టుక ; ధ్రువం = తప్పదు ; తస్మాత్ = అందువల్ల ; అపరిహార్యే = తప్పించ వీలుకాని; అర్థే = విషయంలో ; త్వం = నువ్వు ; శోచితుం = శోకించడానికి ; అర్హసి = అర్హుడవు కావు

తాత్పర్యం

పుట్టినవానికి మరణం తప్పదు; మరణించినవానికి పుట్టుక తప్పదు; తప్పించుకోవడానికి వీలులేని విషయంలో నువ్వు దుఃఖించడం తగదు. ”

వివరణ

అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి ? ”

అని యక్షప్రశ్నలలో యక్షుడు యుధిష్టరుడిని అడుగుతాడు.

చుట్టుపక్కల అందరి మరణాలను చూస్తూనే ఉన్నా

నేను మాత్రం చావనుఅనుకుంటాడు మనిషి.

అదే అన్నింటికన్నా ఆశ్చర్యకరమైన విషయం! ” అని జవాబిస్తాడు ధర్మరాజు.

మనం రోజూ చూస్తూనే ఉంటాం గర్భస్థ శిశువుగా, రోజుల పసిగ్రుడ్డుగా

పసిప్రాయంలోనేఅకాల మృత్యువాతపడి మరణించే వారిని.

అలాగే యవ్వనంలో, ప్రౌఢ ప్రాయంలో ఉన్నవారి దగ్గరనుండి

వృద్ధాప్యంలో ఉన్న వారి వరకూ వివిధ వయస్సుల్లో ఉన్నవాళ్ళు

రోజుకు కోకొల్లలుగా చనిపోతూనే ఉంటారు.

ఇన్ని చూస్తూనే ఉన్నా, “ మన దగ్గరకు మాత్రం మృత్యువు రాదుఅన్న

భ్రమలో ఉంటూంటాం మనం !

చనిపోయిన తన కొడుకు శవం తీసుకువచ్చి బుద్ధుని ముందు ఉంచి,

ప్రాణం పోయమని ప్రాధేయపడుతుంది ఒకానొక తల్లి.

చావు అన్నదే లేని ఇంటి నుంచి కొన్ని ఆవగింజలు తెస్తే,

వాటితో బిడ్డను బ్రతికిస్తానుఅంటాడు బుద్ధుడు.

ఇంతేనా, వెంటనే తెస్తాఅని బయలుదేరుతుంది పాపం తల్లి

తిరిగి తిరిగి అసలు సత్యం తెలుసుకుంటుంది

పుట్టినవారు చావక తప్పదు ; చనిపోయిన వారు తిరిగి జన్మించక తప్పదు.

వచ్చేవారు పోక తప్పదు ; పోయేవారు రాక తప్పదు.

చక్రం తిరిగినప్పుడు క్రిందనున్నది పైకి వస్తుంది.

పైన ఉన్నది క్రిందకి వస్తుంది.

భూలోకంలోని వారు స్వర్గలోకం లోకి వెళ్తారు.

స్వర్గలోకంలోని వారు భూలోకానికి వస్తారు.

చక్రభ్రమణానికి ఏడవడం ఎందుకు ?

ఇది మనకోసం మనం ఏర్పరచుకున్న చక్రభ్రమణం.

చిన్నప్పుడు మనం పాఠాశాలలకు వెళ్ళి తరగతి తరువాత తరగతి పూర్తిచేశాం కదా !

అలాగే భూలోకం కూడా ఆత్మజ్ఞానార్థం ఏర్పడిన అద్భుత పాఠశాల !

ఇక్కడికి వస్తాం. కొన్నాళ్ళుంటాం, కొంత నేర్చుకుంటాం, వెళ్ళిపోతాం !

క్రొత్త క్రొత్త పాఠాలు నేర్చుకోడానికి అనువుగా ఉండే

వేరు వేరు ప్రదేశాల్లో, వేరు వేరు లోకాల్లో మళ్ళీ మళ్ళీ పుడతాం.

ఇలా వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం;

కాబట్టి ఇదేమీ తప్పించుకోవలసిన విషయం కానే కాదు.

జన్మపరంపరలో పుట్టుకకు సంతోషం

మరణానికి శోకం వెలిబుచ్చడం అంటే

మనం సత్యాన్ని తెలుసుకోలేదుఅని అర్థం !

ఇంకా అజ్ఞానం పోలేదుఅని అర్థం !

క్షణంలోనైనా చావు రావచ్చు

కనుక ప్రతిక్షణంలోనూ పూర్తిగా జీవించాలి.

ప్రతిక్షణంలోనూ పూర్తిగా జీవించేవాడే బ్రహ్మజ్ఞాని

ఒకానొక పండితుడు !

మన రాకలు, మన పోకలు మన చేతుల్లోనే వున్నాయి.

వాటికి మనమే సృష్టికర్తలం.

అమ్మ పుట్టించింది కాబట్టి నా రాక అమ్మ చేతుల్లో ఉంది ” …

నా పోక పైవాడి చేతుల్లో ఉందిఅనేవి స్థూలదృష్టిలోని సత్యాలు.

కానీ సూక్ష్మదృష్టిలో, దివ్యదృష్టిలో అవి అసత్యాలు.