భగవద్గీత 2-72

ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి |

స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మనిర్వాణమృచ్ఛతి || ”

 

పదచ్ఛేదం

ఏషాబ్రాహ్మీస్థితిఃపార్థఏనాంప్రాప్యవిముహ్యతిస్థిత్వాఅస్యాంఅంతకాలేఅపిబ్రహ్మనిర్వాణంబుచ్ఛతి

ప్రతిపదార్థం

పార్థ = అర్జునా ; ఏషా = ఇది ; బ్రాహ్మీ = బ్రహ్మనిష్ఠ ; స్థితి = స్థితి ; ఏనామ్ = దీనిని ; ప్రాప్య = పొంది ; , విముహ్యతి = (యోగి ఎప్పుడు) మోహాన్ని పొందడు ; అంతకాలే = మరణ సమయంలో ; అపి = కూడా ; అస్యాం = బ్రాహ్మీస్థితిలో ; స్థిత్వా = ఉండి ; బ్రహ్మనిర్వాణం = బ్రహ్మానందాన్ని ; బుచ్ఛతి = పొందుతున్నాడు.

తాత్పర్యం

పార్థా ! దీనినేబ్రాహ్మీస్థితిఅంటారు; జ్ఞానం పొందినవారు మోహాన్ని పొందరు; మరణకాలం లోపల, యెవడైతే జ్ఞానాన్ని సాధిస్తున్నాడో, వాడు బ్రహ్మనిర్వాణపదాన్ని పొందగల్గుతున్నాడు. ”

వివరణ

ఇంద్రియ విషయాలను, కోరికలను, అహంకార, మమకారాలను

సంపూర్ణంగా త్యజించి

నిందాస్తుతి, సుఖదుఃఖాది ద్వంద్వాలలో సమత్వం కలిగి కర్మాచరణ చేస్తూ

దేహభావాన్ని విడనాడి ఆత్మభావంలో స్థిరపడిన వాడికి

తనకంటే భిన్నంగా ఏదీ లేదు అన్న ఆత్మజ్ఞానం సిద్ధిస్తుంది.

బ్రహ్మానందాన్ని పొందుతాడు

బ్రాహ్మీస్థితిని పొందుతాడు

బ్రహ్మనిష్ఠను పొందుతాడు.

బ్రహ్మనిష్ఠ అన్నది జ్ఞానయోగం యొక్క అంతిమ స్థితి.

బ్రహ్మనిష్ఠ స్థితిని పొందినవాడు ఇక మోహాన్ని పొందడు

మరణ సమయంలో కూడా బ్రహ్మనిష్ఠ చలించదు.

మరణ సమయంలో కూడా బ్రాహ్మీస్థితిలో ఉండి

బ్రహ్మానందాన్ని పొందుతాడు.

బ్రహ్మనిష్ఠ వున్నవాడికే యథార్థ జ్ఞానం కలుగుతుంది.

యథార్థ జ్ఞానం వల్లవున్నది వున్నట్లుగాలేనిది లేనట్లుగాతెలుస్తుంది.

అంతకన్నా ఇక కావల్సిందేముంది?