భగవద్గీత 2-29

ఆశ్చర్యవత్పశ్యతి కశ్చిదేనమ్ ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః

|ఆశ్చర్య వచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద చైవ కశ్చిత్ || ”

 

పదచ్ఛేదం

ఆశ్చర్యవత్పశ్యతికశ్చిత్ఏనంఆశ్చర్యవత్వదతితథాఏవఅన్యఃఆశ్చర్యవత్ఏనంఅన్యః  – శృణోతిశ్రుత్వాఅపిఏనంవేదఏవకశ్చిత్

ప్రతిపదార్థం

కశ్చిత్ = ఒకడు ; ఏనం = దీనిని ( ఆత్మను) ; ఆశ్చర్యవత్ = ఆశ్చర్యమైనదిగా; పశ్యతి = చూస్తాడు ; = మరి ; తథా, ఏవ = అలాగే ; అన్యః = మరొకడు ; ఆశ్చర్యవత్ = ఆశ్చర్యకరంగా ; వదతి = చెపుతాడు ; = అలాగే ; అన్యః = మరొకడు ; ఏనం = దీనిని ; ఆశ్చర్యవత్ = ఆశ్చర్యంగా ; శృణోతి = వింటాడు ; = మరి ; కశ్చిత్ = ఒకడు ; శ్రుత్వా, అపి = విన్నప్పటికీ ; ఏనం = దీనిని ; , ఏవ, వేద = తెలుసుకోలేడు.

తాత్పర్యం

ఒకానొకడు ఆత్మను ఆశ్చర్యంగా చూస్తున్నాడు ; మరొకడు ఆశ్చర్యంగా చెపుతున్నాడు; ఇంకొకడు ఆశ్చర్యంగా వింటున్నాడు; కానీవినటం చేతఆత్మను గురించి తెలుసుకోలేరు. ” 

వివరణ

లోకంలో యోగులు, జ్ఞానులు, ముముక్షువులు, అయోగ్యులు

అని నాలుగు రకాలైన మనుషులు ఉంటారు.

మనం మన కంటికి కనిపించే భౌతిక వస్తువులను

మనస్సు, బుద్ధి, ఇంద్రియాల సముదాయం ద్వారా గ్రహిస్తాం.

ఆత్మఅనేది భౌతికంగా కంటికి కనిపించే వస్తువు కాదు.

ఆత్మను చూడగలిగే వాళ్ళు జగత్తులో చాలా అరుదుగా ఉంటారు.

ఒక్క ఆత్మకే తప్ప మరి దేనికీ ఉనికి అనేది లేనప్పుడు

ఆత్మ తనకు తానే స్వయంగా దర్శించేటప్పుడుఆత్మ ఒక్కటే ఉంటుంది.

చూసేవాడుఅని గానీ .. “ చూడబడేదిఅని గానీ .. వేరు వేరుగా ఏమీ ఉండవు.

అది ఒక అలౌకికమైన, అద్భుతమైన, అరుదైన అనుభూతి.

జ్ఞానచక్షువును సంతరించుకున్న యోగులు … 

ఆత్మజ్ఞానం కలిగిన యోగులు

బయటనుండి చూసేవారికి కళ్ళు మూసుకున్నట్టు కనిపిస్తారు

కానీ లోపల మాత్రం ఆశ్చర్యకరమైన ఆత్మానుభూతిని

తన్మయత్వంతో దర్శిస్తూ ఉంటారు, అనుభవిస్తూ ఉంటారు.

బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఉంటారు.

అటువంటి ఆత్మదర్శన అనుభూతిని మాటలలో వర్ణించడం దుర్లభం.

ఎందుకంటే ఆత్మకు సమానమైన వస్తువేదీ లోకంలోనే లేదు

కనుక దానిని వర్ణించలేము.

అందుకే ఆత్మజ్ఞానులైన వాళ్ళు దానిని వర్ణించడానికి ప్రయత్నించినప్పుడు కూడా తన్మయత్వంతో వివరించగలిగినంత మాత్రమే వివరిస్తూంటారు.

వారు దివ్యచక్షువు ద్వారా చేసిన ఇతర లోక సంచార విశేషాలను

ఆశ్చర్యకరంగా వివరిస్తూంటేముముక్షువులైన వాళ్ళు

ఆత్మజ్ఞానుల చుట్టూ చేరి .. అంతే ఆశ్చర్యంతో, ఆనందంతో వింటూ ఉంటారు.

అటువంటి అనుభవాలకై తాము కూడా తహతహలాడుతూ ఉంటారు.

అయితే జ్ఞానులు చూసినది, చెప్పింది వింటే మాత్రమే

ఆత్మ గురించి తెలుసుకోలేమని వారికి ఖచ్చితంగా తెలుసు.

ఆత్మ గురించి తెలుసుకోవాలంటే

తమ ప్రయత్నం తాము చెయ్యాలని ముముక్షువులకు తెలుసు.

కనుక వారు ధ్యానసాధన ద్వారా ఆత్మజ్ఞానాన్ని సంపాదించగలరు.

అయితే కొంతమంది అయోగ్యులు మాత్రం ఇవన్నీ వింటూ కూడా

మాత్రం తెలుసుకోలేరుతెలుసుకోవాలని ప్రయత్నమూ చేయరు.

చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా !