భగవద్గీత 4-40

అజ్ఞశ్చాశ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి |                  

నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః ||

పదచ్ఛేదం

అజ్ఞఃఅశ్రద్ధధానఃసంశయాత్మావినశ్యతిఅయంలోకఃఅస్తిపరఃసుఖంసంశయాత్మనః

ప్రతిపదార్థం

అజ్ఞః = వివేకహీనుడు ; = మరి ; అశ్రద్ధధానః = శ్రద్ధ లేనివాడు ; సంశయాత్మా = సంశయాలున్నవాడు ; వినశ్యతి = నశిస్తాడు ; సంశయాత్మనః = సంశయాత్ముడికి ; అయం, లోకః = ఈ లోకంలో ; , అస్తి = ఉండదు ; , పరః, = పరలోకమూ ఉండదు ; , సుఖం = సుఖమూ ఉండదు.

తాత్పర్యం

శ్రద్ధాజ్ఞానాలు లేనివాడూ, సందేహాలు వున్నవాడూ, నమ్మకం లేనివాడూచెడిపోతాడు ; సంశయాత్మకుడు అయినవాడు ఇహపరాలు రెండింటికీ దూరమై పోతాడు. ”

వివరణ

శ్రద్ధావాన్ లభతే జ్ఞానం ” …

శ్రద్ధ కలిగినవాడు జ్ఞానాన్ని పొందుతాడు.

గురువులు చెప్పిన వాటినీ, స్వాధ్యాయంలో గ్రహించిన శాస్త్రవిషయాలనూ

శ్రద్ధతోస్వయంసాధన ద్వారా నిజ జీవితంలో నిరూపించుకున్నవాడు జ్ఞానిగా మారతాడు.

శ్రద్ధ లేనివాడు ఏ పనినీ చివరివరకు కొనసాగించలేడుసాధించలేడు, చివరకు అజ్ఞానిగానే మిగిలిపోతాడు.

సత్యాసత్యాల, ఆత్మానాత్మల వివేచనాశక్తి లేని అజ్ఞాని

ఎందుకూ పనికిరాకుండా జీవితమంతా వృథా చేసుకుంటాడు.

మనం శాస్త్రజ్ఞుల కోవకు చెందినవారమే అయితే పరిశోధించి సత్యం తెలుసుకోవాలి.

ఆ తెలివితేటలు, బుద్ధి, చాకచక్యం లేకపోతే, పరిశోధించి చెప్పిన వాడి మాటలు అయినా నమ్మాలి.

ఈ రెండింటినీ కాదని

మనం పరిశోధించి తెలుసుకోలేం, మరిఅవతలివాళ్ళు

చెప్పిందీ నమ్మం అని ….

ప్రతి విషయాన్నీఅవునో కాదో ”, “ నిజమో అబద్ధమోఅని

అనుమానపడుతూ ఉండే

సంశయాత్మకుడికి

ఈ లోకంలోనూ సుఖం ఉండదు,

పైలోకంలోనూ సుఖం ఉండదు ;

మనశ్శాంతి అసలే ఉండదు.

అన్నీ అనుమానాలే అయితే

మనశ్శాంతి ఎక్కడ నుంచి వస్తుంది?

జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం ” …

జ్ఞానాన్ని పొందగలిగినవాడే

పరమశాంతిని పొందుతాడు.